3.80 లక్షల మహిళా గ్రూపులకు రూ.12,070 కోట్లు 

Telangana More Than 12000 Crore Rupees Given To Women Self Help Groups - Sakshi

బ్యాంక్‌ లింకేజీకి ప్రభుత్వ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: 2021–22 ఏడాదికి గ్రామీణ దారిద్య్ర నిర్మూలన మిషన్‌ (సెర్ప్‌) ద్వారా 3,80,162 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.12,070 కోట్ల బ్యాంక్‌ లింకేజీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సీఎం కేసీఆర్‌ రూ.200 కోట్లు మొదటి విడతగా మంజూరు చేశారని పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

మహిళా సంఘాలు తీసుకునే వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని, అందులో భాగంగానే ఈ మొత్తాన్ని సీఎం విడుదల చేసినట్లు చెప్పారు. గతంలో మహిళలు ప్రతి చిన్న ఖర్చుకు భర్తపై ఆధారపడే పరిస్థితినుంచి డ్వాక్రా సంఘాలు ఏర్పడిన తర్వాత వారు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top