
సాక్షి, మహబూబ్నగర్: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్రంపై స్వారీ చేశారు. జిల్లా కేంద్రంలోని కేసీఆర్ ఆర్బన్ ఎకో పార్క్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుర్రపు స్వారీ అకాడమీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం కాసేపు సరాదాగా గుర్రపు స్వారీ చేశారు. దీనికి చెందిన వీడియోను ఆయన తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా KCR ఎకో పార్క్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గుర్రపు స్వారీ అకాడమీని ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/gtASkTSLTQ
— V Srinivas Goud (@VSrinivasGoud) February 3, 2022