మంత్రి జగదీశ్‌రెడ్డికి కరోనా 

Telangana Minister Jagadish Reddy Tests Covid Positive - Sakshi

సాక్షి, నల్లగొండ: తెలంగాణ విద్యుత్‌ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డికి కరోనా సోకింది. జలుబు, నలత లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్‌లో కరోనా పరీక్ష చేయించుకున్నారు. యాంటిజెన్‌ టెస్టులో నెగెటివ్‌ రాగా మంగళవారం ఉదయం వచ్చిన ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంతత్రి సూచించారు. మంత్రి ఆరోగ్యం విషయంలో ఆందోళన పడాల్సిందేమీ లేదని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు మంత్రి సన్నిహితులు వెల్లడించారు.
చదవండి: సజ్జనార్‌కు అర్ధరాత్రి యువతి ట్వీట్.. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top