Telangana: కొత్తగా 14 కరోనా పాజిటివ్‌ కేసులు

Telangana Logs 14 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం 6,408 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వ­హించగా, అందులో 14 మంది వైరస్‌ బారిన­పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమో­దైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షల­కు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి 12 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలు­కు­న్న వారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది.

ప్రస్తు­తం 64 మంది ఐసోలేషన్‌ లేదా చికిత్స పొందు­తున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీని­వా­స­రా­వు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో సోమ­వారం 1,857 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చా­రు.అందులో బూస్టర్‌ డోసు 1,448 మందికి వే­­­యగా, రెండోడోసు 237 మంది, మొదటి డో­సు 172 మందికి వేసినట్లు ఆయన తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top