హైదరాబాద్: పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 పరీక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 2015-16 గ్రూప్-2 పరీక్షలను హైకోర్టు రద్దు చేసింది. తమ ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని పేర్కొన్న కోర్టు.. ఆ పరీక్షలను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది
టీజీపీఎస్సీ పరిధి దాటి వ్యవహరించిందని న్యాయస్థానం స్పష్టం చేసింది. రీవాల్యూయేషన్ చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. 8 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.


