
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు (TG EdCET 2025 Results) శనివారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సిటీ ఉపకులపతి కె.ప్రతాప్రెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్టికెట్ నంబర్-పుట్టిన తేదీ వివరాలతో సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 38,758 మంది దరఖాస్తు చేసుకోగా, 32,106 మంది హాజరయ్యారు. వీళ్లలో 30,944 మంది అర్హత సాధించారు. దీంతో ఉత్తీర్ణత శాతం 96.38గా నమోదైంది.
ఫస్ట్ ర్యాంక్-గణపతి శాస్త్రి(హైదరాబాద్)
శరత్ చందర్(హైదరాబాద్)
నాగరాజు(వరంగల్)