ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఫస్ట్‌ బెయిల్‌..తెలంగాణ సర్కారుకు ‘సుప్రీం’ షాక్‌ | Supreme Court Bail To Asp Tirupathanna In Phone Tapping Case | Sakshi
Sakshi News home page

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఫస్ట్‌ బెయిల్‌..తెలంగాణ సర్కారుకు ‘సుప్రీం’ షాక్‌

Jan 27 2025 12:10 PM | Updated on Jan 27 2025 1:18 PM

Supreme Court Bail To Asp Tirupathanna In Phone Tapping Case

సాక్షి,న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తొలిసారి తెలంగాణ సర్కారుకు గట్టి షాక్‌ తగిలింది. కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరికి మొదటిసారి బెయిల్‌ లభించింది.  కేసులో కీలక నిందితుల్లో ఒకరిగా ఉన్న అడిషనల్‌ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

 తిరుపతన్న బెయిల్‌ పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న,జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీం  ధర్మాసనం సోమవారం(జనవరి27) విచారించింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత కేసు విచారణకు సహకరించాలని బెయిల్‌ ఇచ్చిన సందర్భంగా తిరుపతన్నను సుప్రీంకోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని,అవసరం అయితే ట్రయల్ కోర్టు బెయిల్‌పై మరిన్ని షరతులు విధించాలని సూచించింది. కాగా, తిరుపతన్న బెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది.

ఈ కేసులో ఇంకా సాక్షులను విచారించాలని,దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక నిందితుల్లో ఒకరైన తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టును కోరారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో తిరుపతన్న పది నెలలుగా జైలులో ఉన్నారు. 

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మరో ప్రధాన నిందితుడు టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు నేతృత్వం వహించారని ఆరోపణలున్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ ద్వారా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement