HYD: వేలాది భక్తుల నడుమ సాగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర

Sri Rama Navami Shobha Yatra 2023 Hyderabad Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆకాష్‌పురి మందిరం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది భక్తుల నడుమ శ్రీరాముడి శోభాయాత్ర సాగుతుంది. 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీతారామ్‌బాగ్‌ నుంచి సుల్తాన్‌బజార్‌ వరకు 6.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది.

సీసీ కెమెరాల పర్యవేక్షణలో సాగునున్న శోభాయాత్రను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. శోభాయాత్ర ప్రాంతాల్లో ఆక్టోపస్‌, రిజర్వ్‌ పోలీస్‌ మోహరించారు. సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశామని సౌత్‌ వెస్ట్‌ డీసీపీ కిరణ్‌ ఖారే తెలిపారు.


చదవండి: శ్రీరాముడి శోభాయాత్ర.. ట్రాఫిక్‌ డైవర్షన్‌ వివరాలు ఇవే..

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top