24 గంటల్లో 2058 కేసులు.. 10 మరణాలు

Spike Of 2058 New Cases In Telangana Reached To 160571 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసులు  తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది.  గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2058 కొత్త కేసులు నమోదైనట్లు వ్యైద్యారోగ్యశాఖ తెలిపింది.  దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,60,571కి చేరింది. ఇందులో 1,29,187 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం తెలంగాణలో 30,400 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతిచెందగా.. మొత్తం మరణించిన వారి సంఖ్య 984 కి చేరింది. కేసుల వారిగా చూస్తే.. జీహెచ్ఎంసి 277, కరీంనగర్ 135, ఖమ్మం 103, రంగారెడ్డి 143, సిద్ధిపేట 106, వరంగల్ అర్బన్ లో 108 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 80.45 శాతంగా ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top