సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్ఐఆర్ను కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆగస్టు మూడు వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.ఆగస్టు 3న సర్వే పూర్తి కాగానే ఓటరు డ్రాఫ్ట్ జాబితా ఆగస్టు 10న ప్రచురించనున్నట్లు అని తెలిపింది. అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకూ గడువుగా పేర్కొంది. చివరగా అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించించనుంది.
మారిన షెడ్యూల్ను విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాలని తెలిపింది.


