
సాక్షి, హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్మెట్ ఇనాంగూడ వద్ద డీసీఎం వ్యాను బైక్ని ఢీ కొట్టింది. రెండు సంవత్సరాల కుమారుడు ముందే తండ్రి మృతి చెందాడు.
తండ్రి మృతదేహం పక్కనే కుమారుడు ఏడుస్తూ కూర్చోవడం స్థానికులను కలిచివేసింది. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో బైక్పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చిన్నారికి కూడా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.