నల్లగొండ జిల్లా: చిట్యాల మండలం పిట్టపల్లిలో నోష్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. 3వ బ్లాక్లో ఒక్కసారిగా భారీ శబ్దంతో రియాక్టర్ పేలింది. తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో పేలుడు. ఇదే ఫ్యాక్టరీలో గత నెల 9న రియాక్టర్ పేలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.


