ఈసారి పాలేరులో పావురం

Pigeons With Badge On Legs Found In Khammam District - Sakshi

కర్నూలు నుంచి వచ్చినట్టు నిర్ధారణ 

పోటీల్లో భాగంగా వదిలారని చర్చ

కూసుమంచి: ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు.. కాళ్లకు విదేశీ భాషలతో కూడిన ట్యాగ్‌లతో వస్తున్న పావురాల విషయంలో మిస్టరీ వీడిపోయింది. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలానికి బుధవారం పావురం రాగా.. కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన నునావత్‌ నవీన్‌ ఇంటి ఆవరణలో గురువారం ఓ పావురం వాలింది. దీని రెండు కాళ్లకు ట్యాగ్‌లుండగా.. అప్పటికే పత్రికల్లో వచ్చిన కథనాలను చూసిన ఆయన అనుమానపడ్డారు.

పావురం కాలికి ఉన్న ట్యాగ్‌పై దాస్‌ అనే పేరుతో ఫోన్‌ నంబర్‌ ఉండగా.. ఆ నంబర్‌కు ఫోన్‌చేసి ఆరా తీశారు. కర్నూలుకు చెందిన వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ ఆ పావురం తనదేనని, ఇటీవల 50 వరకు పావురాల కాళ్లకు ట్యాగ్‌లు కట్టి పోటీల్లో భాగంగా వదిలి పెట్టామని వివరించాడు. అవి కరీంనగర్, హైదరాబాద్‌ చేరుకోవలసి ఉండగా.. కాళ్లకు కట్టిన ట్యాగ్‌పై ఉన్న స్క్రాచ్‌ కార్డు ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ పావురాలతో ప్రమాదం లేదని చెప్పారు. వీలైతే సంరక్షించాలని లేదా రంధ్రాలు కలిగిన బాక్సుల్లో ఉంచి తమ చిరునామాకు బస్సుల ద్వారా పంపించాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top