ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: రాధాకిషన్ రిమాండ్‌ రిపోర్టులో సంచలన నిజాలు | Phone Tapping Case: RadhaKishan Remand Report | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: రాధాకిషన్ రిమాండ్‌ రిపోర్టులో సంచలన నిజాలు

Apr 1 2024 5:26 PM | Updated on Apr 1 2024 6:05 PM

Phone Tapping Case: RadhaKishan Remand Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం అటు రాజకీయంగానూ తీవ్ర దమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది.

తాజాగా ట్యాపింగ్‌ కేసులో A4గా ఉన్న రాధాకిషన్‌ రావు రిమాండ్‌ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి డబ్బులు తరలించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు ఒప్పుకున్నారు.  ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు మేరకు ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్‌ రావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌లోని సిబ్బందిని బెదిరించి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన డబ్బులను సరఫరా చేసినట్లు అంగీకరించారు. టాస్క్‌ఫోర్స్‌ బృందానికి వాహనాలు సమకూర్చినట్లు ఒప్పుకున్నారు. ఓ ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి డబ్బులు తరలించినట్లు పేర్కొన్నారు. 2023లో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది డబ్బుల పట్టుకోవడంలో కీలక పాత్ర వహించినట్లు వెల్లడించారు. 8 సార్లు పట్టుకున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదేనని చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ ద్వారా 2018లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య సిమెంట్ ఆనంద్ ప్రసాద్ నగదు ప్యారడైజ్ వద్ద 70 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునంధన్ రావు, ఆయన బందువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.  ముడుగోడు ఉప ఎన్నిక సందర్భంగా  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహచరుల నుంచిరూ.3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నామని రాధకిషన్‌ రావు చెప్పినట్లు  పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement