మట్టి ఇళ్లలోనే మహానందం..! | Old House In Nizamabad | Sakshi
Sakshi News home page

మట్టి ఇళ్లలోనే మహానందం..!

Jun 8 2025 12:35 PM | Updated on Jun 8 2025 12:42 PM

 Old House In Nizamabad

పాత కాలపు ఇళ్లను పదిలంగా కాపాడుకుంటున్న నేటి తరం 

యాబై ఏళ్ల క్రితం నిర్మించిన రెండంతస్తుల పెంకుటిళ్లు 

సౌతర్లు, అరుగులు, బడకలు ప్రత్యేకం 

ఇప్పటికీ చెక్కు చెదరని నివాసాలు 

ఉమ్మడి కుటుంబాలకు ఇప్పుడవే జ్ఞాపకాలు 

డొంకేశ్వర్‌లో 150 పైగా ఒకే రకమైన గృహాలు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): పల్లెలన్నీ కొత్త భవనాల మోజులో పరుగెడుతుంటే.. డొంకేశ్వర్‌ ఊర్లో మాత్రం పాత కాలపు పెంకుటిళ్లకు క్రేజీ పెరుగుతోంది. తా తలు, తండ్రులు నిర్మించి ఇచ్చిన ఆస్తులను ఇప్ప టికీ పదిలంగా కాపాడుకుంటున్నారు. గోడ లు, తలుపులకు రంగులద్ది అందంగా తీర్చి దిద్దుకుంటున్నారు. అన్ని హంగులతో కొత్త భవనాలు నిర్మించుకునే స్థాయి ఉన్నా కూడా పెంకుటిళ్లలోనే నివాసం ఉంటున్నారు. అయితే, వీటి నాణ్యతను చూస్తే నేటి తరం సిమెంట్‌ బిల్డింగులను తల దన్నేలా ఉన్నా యి. మరో యాబై ఏళ్లు కూడా నిలబడే విధంగా ధృఢంగా ఉండడం గమనార్హం. 

డొంకేశ్వర్‌ ఎస్సారెస్పీలో ముంపునకు గురైన గ్రామం. ప్రాజెక్టులో ఇళ్ల న్నీ మునిగిపోవడంతో 1975 నుంచి ఎగువ ప్రాంతంలో కొత్తగా ఇళ్లను నిర్మించుకున్నా రు. చాలా మంది భూస్వాములు అప్పట్లో నల్లమట్టితో రెండతస్తుల ఇళ్లను కట్టించారు. తూర్పు నుంచి మేస్త్రీలు వచ్చి వందల ఇళ్లను నిర్మించారు. ఊరికి పై, కింది భాగాల్లో నిర్మించగా ఇళ్లన్నీ దాదాపు ఒకే (డిజైన్‌) విధంగా ఉన్నాయి. మట్టి గోడలకు సున్నం వేసి నునుపుగా చేయించారు. మొదటి అంతస్తు స్లా బు కు కూడా మట్టినే వినియోగించారు. ఒకటి, రెండ తస్తులైనా కూడా ఇంటికి పెంకులు (బొంబాయి కూన) వాడారు. అప్పట్లో ఇవే డాబు, దర్పం. చరిత్ర చెప్పుకునేలా ఇంటి నిర్మాణాలు ఆసక్తిగా కూడా ఉన్నాయి. 

ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇరువైపులా రాతితో సౌతర్‌లు కట్టించారు. ప్రధాన ద్వారం చాలా పెద్దదిగా, తలుపులు ధృఢంగా చేయించారు. ఇవి ఇంటికే రాజసాన్ని తెచ్చేలా ఉన్నా యి. కిటికీలు కూడా ఇదే స్థాయిలో అందంగా తయారు చేయించారు. మొదటి గడపను దాటగానే బడకలు, ఇంటి లోపల అరుగులు, మొద్దులతో తయారు చేసిన డిజైన్‌ స్తంభాలు, దులాలు నాటి కాలపు ఇళ్లకు ప్రత్యేక ఆకర్షణ. 

విశాలమైన పెంకుటిళ్లలో అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు నివాసం ఉండేవి. ఎవరివి వారికి గదులు ఉండగా, అరుగు మీద భోజనాలు చేసే వారు. పండుగలు కలిసి జరుపుకునే వారు. యాబై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పెంకుటిళ్లలో ప్రస్తుతం నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పటికీ డొంకేశ్వర్‌ గ్రామంలో 150 పైగా పెంకుటిళ్లు చెక్కు చెదరకుండా ఉన్నాయి.

నాలుగు కుటుంబాలు ఉండేవి..
మా నాన్నకు నలుగురు సంతానం. అప్పట్లో మేస్త్రీకి రూ.20 వేలు ఇచ్చి ఇళ్లు కట్టించారు. దాదాపు రూ.2లక్షల వరకు ఖర్చు అయింది. విశాలమైన పెంకుటింట్లో నాలుగు కుటుంబాలు నివాసం ఉండేవి. మాది ఉమ్మడి కుటుంబం. ఒకే ఇంట్లో కలిసి జీవించిన రోజులను మరిచిపోలేము.  
– కల్లెం నర్సయ్య, డొంకేశ్వర్‌

పెంకుటిళ్లంటే ఇష్టం..
పెంకుటిళ్లుని మా నాన్న గంగారం కట్టించారు. మట్టితో కట్టిన ఇళ్లంటే నాకు ఎంతో ఇష్టం. పెద్దలు ఇచ్చిన ఇళ్లుని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా. కొత్త బంగ్లా కట్టుకునే స్థోమత ఉన్నా పెంకుటింట్లో ఉండే ఆనందమే వేరు. అందుకే పాత ఇంటిలోనే ఉంటున్నాం.
 – నాయకుడి చందు, మాజీ సర్పంచ్‌

మట్టితో కట్టారు..
అప్పట్లో మా ఇంటి పెద్దలు మట్టితోనే పెంకుటిళ్లు కట్టారు. 45 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఇందులోనే నివాసం ఉంటున్నాం. గోడలు చాలా పెద్దవిగా ఉన్నాయి. వర్షం పడినా ఇబ్బంది ఉండది. పిల్లలు పాతకాలపు ఇళ్లను ఇష్టపడుతారు. సెలవుల్లో ఇక్కడికే వస్తారు. 
– అప్పాల భోజమ్మ, డొంకేశ్వర్‌

ఇళ్లు చల్లగా ఉంటుంది..
మట్టిని తెచ్చి కాళ్లలో బా గా తొక్కి ఇళ్లను కట్టా రు. మట్టితో కట్టిన ఇళ్లు ఇప్పటికీ గట్టిగా ఉన్నా యి. పైన బొంబాయి కూన పరిస్తే ఇళ్లు అందంగా కనిపిస్తుంది. మట్టి గోడలు, పైకప్పు కూన ఉండడంతో ఎంతటి ఎండలోనైనా ఇళ్లు చల్లగా ఉంటుంది. నేలమీది బండలు కూడా చల్లగా మారిపోతాయి. 
– రాజుబాయి, డొంకేశ్వర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement