మేడ్చల్ జిల్లా: పీర్జాదిగూడ డివిజన్ పర్వతాపూర్ శబరిగార్డెన్ బ్యాక్ సైడ్ బీపీఎం గ్రీన్ల్యాండ్స్ కాలనీలో తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ముసుగులు, గ్లౌజులు ధరించి టార్చి లైట్లతో కాలనీలో తిరుగుతున్నారని కాలనీవాసులు తెలిపారు. కాలనీ వాసులు తెలిపిన మేరకు.. ఓ ఇంట్లో సెల్ఫోన్ అపహరణకాగా.. మరో ఇంట్లో నగదు దొంగతనానికి గురైందన్నారు.
ఈ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగలు కాలనీలో పలు వీధుల్లో చాలాసేపు సంచరిస్తూ.. పరిశీలించిన దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ ఏమీ లభించకపోవడంతో మరో ఇంట్లోకి గోడ దూకేందుకు ప్రయత్నించగా.. ఓ మహిళ కేకలు వేయడంతో వారు అక్కడినుంచి పారిపోయారు. ఘటనపై మేడిపల్లి పోలీసులు విచారణ జరిపి రాత్రి వేళల్లో గస్తీని పెంచి తమకు రక్షణను కలి్పంచాలని స్థానికులు కోరుతున్నారు.


