నేపాల్‌: సొరంగాల్లో 900 మంది కార్మికులు.. నిపుణుల ఆందోళన | Nepal Flood Catastrophe Over 900 Hydro Workers Trapped Death Toll Reaches 939 | Sakshi
Sakshi News home page

నేపాల్‌: సొరంగాల్లో 900 మంది కార్మికులు.. నిపుణుల ఆందోళన

Sep 1 2026 7:53 AM | Updated on Sep 1 2026 8:25 AM

Nepal Flood Catastrophe Over 900 Hydro Workers Trapped Death Toll Reaches 939

ఖాట్మండు: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 939కి పెరిగింది. త్రిశూలి నది పరివాహక ప్రాంతంలోని జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకుపోయిన 900 మందికి పైగా కార్మికులను రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతుండటంతో బాధితులు బతికే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు కొండ ప్రాంతాన్ని పేలుడు పదార్థాలతో పేల్చి, త్రిశూలి-3A సైట్‌లోని సొరంగాల్లోకి గాలిని పంపింగ్ చేస్తున్నాయి. నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం లెక్కల ప్రకారం, 592 మంది విదేశీయులతో సహా మొత్తం 3,925 మంది గల్లంతయ్యారు. చైనా, నేపాల్ సైనిక దళాలతో పాటు భారత్, కొరియా, ఆస్ట్రేలియా నిపుణులు ఈ సంయుక్త సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.

సుమారు 11 జలవిద్యుత్ ప్రాజెక్టులు వరద తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పర్ త్రిశూలి ప్రాజెక్టు నుంచి గత వారాంతంలో 250 మందిని రక్షించగా, మరో 42 మంది కార్మికుల కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు చిత్వాన్‌లో గుర్తుతెలియని మృతదేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్లు సరిపోక తాత్కాలిక ఖననాలు చేపట్టారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు పూర్తయిన తర్వాతే అవశేషాలను బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఇటు టిబెట్ పరిధిలో 16 మంది మరణించగా, 546 మంది గల్లంతైనట్లు చైనా అధికారికంగా ప్రకటించింది.

ఇది కూడా చదవండి: కార్ల మధ్య రహస్య సంభాషణతో రోడ్డు ప్రమాదాలకు చెక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement