సాక్షి, హైదరాబాద్/రసూల్పురా: గ్రేటర్ వాసులను మెట్రో జర్నీ వైపు ఆకర్షించేందుకు మెట్రో రైలు సంస్థ పలు రాయితీలు కల్పించింది. దసరా సందర్భంగా ‘మెట్రో సువర్ణ’ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం ఈనెల 17 నుంచి 31 వరకు ప్రయాణికులకు టికెట్ చార్జీల్లో 40 శాతం రాయితీ లభించనుంది. అంటే ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణానికి రూ.60 గరిష్ట చార్జీ ఉండగా... 40 శాతం రాయితీ పోను రూ.36 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఆఫర్లలో భాగంగా గరిష్టంగా 40 ట్రిప్పులకు చార్జీ చెల్లించి 60 ట్రిప్పులు జర్నీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ రాయితీల వివరాలను శుక్రవారం సాయంత్రం రసూల్పురాలోని మెట్రోరైలు కార్యాలయంలో హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డిలు సంయుక్తంగా ప్రకటించారు. కాగా లాక్డౌన్కు ముందు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం.. మొత్తం మూడు రూట్లలో నిత్యం 3.5 లక్షల మంది మెట్రో జర్నీ చేసేవారు. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ రోజుకు 90 వేలకు తగ్గింది. ఇటీవలి వర్షాలకు నగరంలో భారీగా రహదారులు దెబ్బతినడం, తమ ఆఫర్ల కారణంగా మెట్రో తిరిగి పూర్వపు స్థాయిలో ప్రయాణికులతో కళకళలాడుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.
స్మార్ట్కార్డ్కు ఆఫర్ ఇలా...
► ఈ ఆఫర్ ప్రకారం కేవలం 14 ట్రిప్పులకు డబ్బు చెల్లించి 20 ట్రిప్పులు జర్నీ చేయవచ్చు. స్మార్ట్కార్డు రీఛార్జీ చేసిన దగ్గరి నుంచి 30 రోజుల వరకు ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. అంటే ఎల్బీనగర్ నుంచి మియాపూర్కు నిత్యం జర్నీ చేసే ప్రయాణికుడు కేవలం 14 ట్రిప్పులకు.. అంటే రూ.840 చెల్లించి 20 ట్రిప్పుల జర్నీ చేసే అవకాశం ఉంటుంది. అంటే అతనికి రూ. 360 ఆదా కానుంది.
► ఇక 20 ట్రిప్పులకుగాను స్మార్ట్కార్డులో రీఛార్జీ చేసుకుంటే 30 ట్రిప్పులు ప్రయాణించవచ్చు. రీఛార్జీ చేసిన దగ్గరి నుంచి 45 రోజులపాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
► ఇక గరిష్టంగా 40 ట్రిప్పులకు డబ్బులు చెల్లిస్తే... 60 ట్రిప్పులు జర్నీ చేయవచ్చు. ఈ ఆఫర్ రీచార్జీ చేసిన దగ్గరి నుంచి 60 రోజులపాటు అమల్లో ఉంటుంది.
► ఈ మెట్రో సువర్ణ ఆఫర్ ఈనెల 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఆలోగా రీచార్జీ చేసుకోవాల్సి ఉంటుంది.
నవంబరు ఒకటి నుంచి క్యాష్బ్యాక్
మీ స్మార్ట్కార్డును ఆన్లైన్ ద్వారా రూ.400– 1800 వరకు రీఛార్జీ చేసుకుంటే 50 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. అంటే రూ.400 చెల్లించి రీఛార్జీ చేసుకుంటే మీ కార్డుకు రూ.600 జమ అవుతాయి. ఈ ఆఫర్ నవంబరు ఒకటిన ప్రారంభమై జనవరి 15 వరకు అందుబాటులో ఉంటుంది.
‘మెట్రో’ రాయితీలు
Published Sat, Oct 17 2020 3:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement