తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ | Massive Transfer Of Ias Officers In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

Jun 12 2025 9:10 PM | Updated on Jun 12 2025 9:30 PM

Massive Transfer Of Ias Officers In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాష్‌, ఢిల్లీ తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌ను నియమించింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. 

తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా జె.శంకరయ్య, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా శివకుమార్‌ నాయుడు, రిజిస్ట్రేషన్స్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆర్‌.హనుమంతు, నిజామాబాద్‌ కలెక్టర్‌గా వినయ్‌ కృష్ణారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్‌గా హరిచందన దాసరి, రెవెన్యూ శాఖ ​​ముఖ్య కార్యదర్శిగా లోకేష్‌కుమార్‌, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ను నియమించింది.

తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా వల్లూరి క్రాంతి, హ్యూమన్‌ రైట్స్‌ కమిషనర్‌ సెక్రటరీగా నిర్మల క్రాంతి వెస్లీ, ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా నిఖిల్‌ చక్రవర్తి, సమాచారశాఖ కమిషన్‌ కార్యదర్శిగా భారతి లక్‌పతి నాయక్‌, సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా ఈ. నవీన్‌ నికోలస్, హన్మకొండ కలెక్టర్‌గా స్నేహశబరీష్‌, స్త్రీ,శిశు సంక్షేమ డైరెక్టర్‌గా శ్రీజన, ఆరోగ్యశ్రీ సీఈవోగా ఉదయ్‌ కుమార్‌, ఐఅండ్‌పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌గా చెక్క ప్రియాంక బదిలీ అయ్యారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement