‘రామప్ప సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు’ | KTR Comments About KCR And Ramappa Temple UNESCO heritage recognition | Sakshi
Sakshi News home page

‘రామప్ప సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు’

Jul 29 2021 1:07 AM | Updated on Jul 29 2021 1:07 AM

KTR Comments About KCR And Ramappa Temple UNESCO heritage recognition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రామప్పకు యునెస్కో వారసత్వ గుర్తింపు సాధనలో సీఎం కేసీఆర్‌ కృషి ఎంతో ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో రామప్ప ఆలయం ప్రపంచ పర్యాటక ప్రాంతం అవు తుందన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కేటీఆర్‌ను కలిశారు. రామప్ప ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఎర్రబెల్లి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రామప్ప ఆలయం చిత్రపటాన్ని బహూకరించారు. కేటీఆర్‌ను కలసిన వారిలో పార్టీ రాష్ట్ర సోషల్‌మీడియా కన్వీనర్‌ వై.సతీశ్‌రెడ్డి, లింగాలఘణపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement