కేరళ సీఎం విజయన్‌ హైదరాబాద్‌ రాక | Kerala CM Pinarayi Vijayan To Address Public Meeting In Khammam | Sakshi
Sakshi News home page

కేరళ సీఎం విజయన్‌ హైదరాబాద్‌ రాక

Dec 29 2022 3:46 AM | Updated on Dec 29 2022 3:49 PM

Kerala CM Pinarayi Vijayan To Address Public Meeting In Khammam - Sakshi

కేరళ సీఎం విజయన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, ఇతర నాయకులు 

సాక్షి, హైదరాబాద్‌/ఖమ్మం: ఖమ్మంలో గురువారం జరగనున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మూడో రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బుధవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రభుత్వ అతిథి గృహంలో సీపీఎం ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మూడో రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో గురువారం మొదలుకానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళా శాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేరళ సీఎం పినరయి విజయన్‌  ప్రసంగిస్తారు. సభకు లక్ష మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement