ఎరువులను 24 గంటల్లో ఇవ్వాలి | KCR conspiracy central fertilizers from reaching farmers: Indrasena Reddy | Sakshi
Sakshi News home page

ఎరువులను 24 గంటల్లో ఇవ్వాలి

Sep 11 2023 2:44 AM | Updated on Sep 11 2023 2:44 AM

KCR conspiracy  central fertilizers from reaching farmers: Indrasena Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మార్క్‌ఫెడ్‌ వద్ద నున్న కేంద్రం పంపించిన ఎరువుల ను 24 గంటల్లో రైతులకు ఇవ్వక పోతే...­ఆ కార్యాలయాలను బీజేపీ కార్య­కర్తలు ముట్టడించి ప్రజలకు పంపిణీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు.

ఆదివారం ఆయన మీడి­యాతో మాట్లాడుతూ 17న సభ కోసం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌ ఇవ్వా లంటూ కాంగ్రెస్‌ దరఖాస్తు చేసుకుంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ–బీఆర్‌ఎస్‌ ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితల మధ్య వ్యాపార సంబంధాలు, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌లు కలిసి పోటీ చేయడంపై చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement