
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కార్ల వినియోగదారుల కోసం ఆదివారం నుంచి ఇసుజు మోటార్స్ సరీ్వస్ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇసుజు ఐ–కేర్ మాన్సూన్ క్యాంప్ పేరిట ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాల్లో తమ డి మ్యాక్స్ పికప్స్, ఎస్యూవిలకు అవసరమైన సర్వీసులన్నీ అందిస్తామని, ఈ క్యాంప్స్ నగరంలోని తమ అధికారిక డీలర్ల దగ్గర అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ క్యాంపులు ఆదివారం ప్రారంభమై, ఈ నెల 28 వరకూ కొనసాగుతాయన్నారు.