Hyderabad Osmania Doctors Stuck In Himachal Floods, Here Updates - Sakshi
Sakshi News home page

హిమాచల్ వరదల్లో చిక్కుకున్న ఉస్మానియా డాక్టర్లు! మంత్రి హరీష్‌ ఆరా

Jul 11 2023 6:15 PM | Updated on Jul 11 2023 7:03 PM

Hyderabad Osmania Doctors Struck Himachal Floods Updates - Sakshi

ముగ్గురూ డాక్టర్లే. వాళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తుండడంతో.. 

సాక్షి, హైదరాబాద్‌: వాతావరణంలో నెలకొన్న అనూహ్య పరిణామాలతో ఉత్తర భారతాన్ని ఎడతెరిపి ఇవ్వని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  ఎటు చూసినా వరద పోటెత్తిన దృశ్యాలు.. మనుషులు, వాహనాలు, భవనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాల ధాటికి 72 మంది మృతిచెందగా.. 10 మంది అదృశ్యమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ ఉస్మానియాకు చెందిన ముగ్గురు వైద్యులు హిమాచల్‌ ప్రదేశ్‌ వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. 

హిమాచల్‌ ప్రదేశ్‌ వరదల్లో ఉస్మానియాకు చెందిన డాక్టర్‌ బానోత్‌ కమల్‌లాల్‌, డాక్టర్‌ రోహిత్‌ సూరి, డాక్టర్‌ శ్రీనివాస్‌లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామానికి చెందిన మరింత సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన ఓ ఫ్యామిలీ సైతం ఉత్తరాది భీకర వర్షాల్లో చిక్కుకుపోగా.. ఆదివారం నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. అయితే.. చివరికి వాళ్లు సురక్షితంగా నగరానికి తిరుగు పయనమైనట్లు తేలింది.  

మంత్రి హరీష్‌ ఆరా
ఢిల్లీ పర్యటనలో భాగంగా.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. కృష్ణా నది ట్రిబ్యునల్, నీటి ప్రాజెక్టుల అంశాలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారాయన.  అదే సమయంలో.. హిమాచల్‌ వరదల్లో ఉస్మానియా వైద్యులు చిక్కుకుపోయిన పరిణామంపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరా తీశారు. వైద్యులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారాయన. 

ఇదీ చదవండి: హిమాన్షు పెద్ద మనసు.. కోటి రూపాయలతో.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement