నిజామాబాద్‌ మార్కెట్‌కు భారీగా పసుపు | Huge Supply Of Turmeric To Nizamabad Market, Check Prices And More Details Inside | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ మార్కెట్‌కు భారీగా పసుపు

May 2 2025 4:34 AM | Updated on May 2 2025 12:39 PM

Huge supply of turmeric to Nizamabad market

గతేడాదితో పోలిస్తే మరింతగా సాగు విస్తీర్ణం.. అధిక దిగుబడులు 

నిజామాబాద్‌ మార్కెట్‌కు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6,63,840 క్వింటాళ్లు 

2023–24లో మార్కెట్‌కు వచ్చిన పసుపు 7,23,470 క్వింటాళ్లు 

2024–25 ఆర్థిక సంవత్సరంలో 7,59,915 క్వింటాళ్లు 

2025–26 ఆర్థిక సంవత్సరంలో 1,37,947 క్వింటాళ్లు 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పసుపు విషయంలో రాష్ట్రంలో పెద్దదైన నిజామాబాద్‌ మార్కెట్‌కు ప్రస్తుత సీజన్‌లో భారీగా పసుపు వస్తోంది. నిజామాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలైన జగిత్యాల, నిర్మల్‌ తదితర జిల్లాల్లో పసుపు సాగు విస్తీర్ణంతో పాటు దిగబడులు సైతం పెరిగాయి. రాష్ట్రంలో పండుతున్న పసుపులో దాదాపు 70 నుంచి 80 శాతం పసుపు నిజామాబాద్‌ మార్కెట్‌కు వస్తుంది. ఇక 2023–24 సీజన్‌ (జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌) నెలల్లో ఇందూరు మార్కెట్‌కు 4,55,398 క్వింటాళ్ల పసుపు వచ్చింది. 

2020–21 ఆర్థిక సంవత్సరంలో 8,55,516 క్వింటాళ్లు, 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8,38,932 క్వింటాళ్లు, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7,49,072 క్వింటాళ్లు, 2023– 24 ఆర్థిక సంవత్సరంలో 7,23,470 క్వింటాళ్ల పసుపు మార్కెట్‌కు వచ్చింది. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7,59,915 క్వింటాళ్ల పసుపు ఇందూరు మార్కెట్‌కు వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 1,37,947 క్వింటాళ్ల పసుపు వచ్చింది.  

గత సీజన్‌లో రాష్ట్రంలో సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది తెగుళ్లు సోకకపోవడంతో ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల ఎక రాల్లో పసుపు సాగు చేయగా.. ఇందులో 19 వేల ఎకరాలు నిజామాబాద్‌ జిల్లా రైతులు సాగు చేశా రు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ఎకరాలు సాగు చేయగా, ఇందులో నిజామాబాద్‌ జిల్లా రైతులు 22 వేల ఎకరాల పసుపు సాగు చేశారు. 

ఈ సీజన్‌లో ఇప్పటివరకు పసుపు ధక అత్యధికంగా క్వింటాకు రూ.15,800 పలికింది. ప్రస్తుతం క్వింటాకు రూ.13,949 ధర పలుకుతోంది. నిజామాబాద్‌ మార్కెట్‌లో తేమ శాతం, కర్కుమిన్‌ శాతం సైతం తీస్తున్నారు. ఇక కర్కుమిన్‌ 3 శాతం ఉంటుందని మార్కెట్‌ కమిటీ అధికారులు తెలిపారు. 

పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో.. ఈసారి రైతులు పసుపు సాగుకు మొగ్గు చూపడంతో విస్తీర్ణం పెరిగింది. పైగా గత ఏడాది సగటున పసుపు ధర రూ.18 వేల వరకు పలికింది. సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇది కూడా ఒక కారణమని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement