హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఎల్అండ్టీ సంస్థతో షేర్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. ఎల్ అండ్ టీ నుంచి రూ.1,461.47 కోట్లకు 100% షేర్లను స్వాధీనం చేసుకుంది, దీంతో ఫేజ్-I, ఫేజ్-II విస్తరణ, సేవల సమన్వయం మెరుగుపడనుంది. దీంతో ఇప్పుటి నుంచి మెట్రో నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. కాగా మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.


