హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం మరమ్మత్తుకు సంబంధించిన పనులపై కల్నల్ పరీక్షిత్ మెహ్రా అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల రీహాబిలిటేషన్కు ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీ నియమించినట్లు పేర్కొంది. మే 30 నాటికి మరమ్మత్తుకు సంబంధించిన పరిశోధన పూర్తిచేయాలని ఆదేశించింది.


