బిల్లులు రాక.. పంచాయతీ భవనం తాకట్టు! | former Sarpanch Panchayat Building Collateral | Sakshi
Sakshi News home page

బిల్లులు రాక.. పంచాయతీ భవనం తాకట్టు!

Nov 9 2024 11:30 AM | Updated on Nov 9 2024 11:30 AM

former Sarpanch Panchayat Building Collateral

జగిత్యాల జిల్లాలోఓ మాజీ సర్పంచ్‌ చర్య

18 లక్షలతో పంచాయతీ భవనం నిర్మించా.. సర్కారు బిల్లులు ఇవ్వక పోవటంతో అప్పులపాలయ్యా

తొంబరావుపేట మాజీ సర్పంచ్‌ సత్తమ్మ ధర్మారెడ్డి  

మేడిపల్లి (వేములవాడ): చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవటంతో ఓ మాజీ సర్పంచ్‌ గ్రామ పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మేడిపల్లి మండలం తొంబరావుపేట తాజా మాజీ సర్పంచ్‌ మామిడి సత్తమ్మ ధర్మారెడ్డి శుక్రవారం కట్లకుంట తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో పంచాయతీకి సంబంధించి దస్త్రాలను తాకట్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు రూ.18 లక్షలకు పైగా అప్పు చేసి తొంబరావుపేట పంచాయతీ భవనం నిర్మించామని, ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవటంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని వాపోయారు. అప్పు ఇచి్చనవారు రోజూ ఇంటికి వచ్చి వేధిస్తున్నారని తెలిపారు.

 దీంతో అప్పులు తీర్చేందుకు లోన్‌ కోసం పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేసిన వెంటనే వడ్డీతో సహా బ్యాంకులో చెల్లిస్తానని సిబ్బందికి వివరించారు. తాకట్టు పెట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తమకు వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని లేకుంటే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బ్యాంకు అధికారిని సంప్రదించటానికి ప్రయతి్నంచగా అందుబాటులోకి రాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement