సాక్షి, హైదరాబాద్: కూకట్ పల్లి ప్రశాంత్ నగర్లోని పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏబీసీ ప్రింటింగ్ పరిశ్రమలో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రింటింగ్ పరిశ్రమలో పెయింట్లు అధికంగా ఉండడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.


