15 రోజుల్లో కొత్త పింఛన్లు  | Errabelli Dayakar Rao Says New Pension Will Sanctioned In 15 Days | Sakshi
Sakshi News home page

15 రోజుల్లో కొత్త పింఛన్లు 

Mar 1 2022 3:27 AM | Updated on Mar 1 2022 3:27 AM

Errabelli Dayakar Rao Says New Pension Will Sanctioned In 15 Days - Sakshi

వికారాబాద్‌: 15 రోజుల్లో కొత్త పింఛన్లుమంజూరు చేస్తామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సోమవారం వికారాబాద్‌లో నూతన జిల్లా పరిషత్‌ కార్యాలయ భవనానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో మూడేళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వలేకపోయామని, త్వరలోనే అర్హులకు పింఛన్లు ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కొత్తగా 10 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేస్తామని, ఒక్కో జెడ్పీటీసీకి రూ. 15 లక్షల నిధులు ఇస్తామని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement