తెలుగు వర్సిటీలో సాంస్కృతిక పురస్కార ప్రదానోత్సవం 26న  | Cultural Award Ceremony In Telugu University On 26th August | Sakshi
Sakshi News home page

తెలుగు వర్సిటీలో సాంస్కృతిక పురస్కార ప్రదానోత్సవం 26న 

Aug 24 2022 1:21 AM | Updated on Aug 24 2022 9:47 AM

Cultural Award Ceremony In Telugu University On 26th August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నెల 26వ తేదీన సాంస్కృతిక పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష, సాహితీ, సంస్కృతుల వ్యాప్తికి దేశవిదేశాల్లో సేవలందించిన వారికి ఏటా ఈ పురస్కారం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఇందులో భాగంగా ఈ ఏడాది చెన్నైకి చెందిన ప్రొఫెసర్‌ చిల్లకూరు ముద్దు కృష్ణారెడ్డికి ఈ పురస్కారాన్ని రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌తో అందిస్తున్నట్టు తెలిపారు. యూనివర్సిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పురస్కార ప్రదానోత్సవం గవర్నర్‌తో జరుగుతుందని పేర్కొన్నప్పటికీ.. ఆమె పేరును ప్రస్తావించడకపోవడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement