కొంపముంచిన ఎన్నికల బందోబస్తు.. | Covid Second Wave Spreading Faster In Nizamabad | Sakshi
Sakshi News home page

కొంపముంచిన ఎన్నికల బందోబస్తు..

Apr 27 2021 11:16 AM | Updated on Apr 27 2021 11:47 AM

Covid Second Wave  Spreading Faster In Nizamabad  - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, నిజామాబాద్‌ అర్బన్‌: పోలీసు శాఖలో కరోనా కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వైరస్‌ బారిన పడడం ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, ఇటీవల జరిగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు కరోనా సోకింది. సాగర్‌ ఉప ఎన్నికలకు జిల్లా నుంచి ఏసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు కలిపి 112 మంది బందోబస్తుకు వెళ్లారు. 16 రోజుల పాటు అక్కడ విధులు నిర్వహించారు. ఎన్నిక ముగిసిన తర్వాత జిల్లాకు వచ్చిన పోలీసులు ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు.

ఇప్పటివరకు 32 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులకు సైతం వైరస్‌ సోకింది. దీంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. కోవిడ్‌ బాధితుల్లో కొందరు హోం ఐసోలేషన్‌లో, మరి కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి 17 మంది కోలుకున్నట్లు తెలిసింది. ఉప ఎన్నికకు వెళ్లి కరోనా బారిన పడిన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై సీపీ కార్తికేయ నిత్యం వాకబు చేస్తున్నారు. వైరస్‌ బారిన పడిన సిబ్బందితో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. ఇందులో సీపీ, అదనపు డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వో, సీఐలు, ఎస్‌బీ అధికారులు ఉన్నారు. కరోనా బారిన పడిన తమ సిబ్బందితో వీరంతా మాట్లాడుతున్నారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తూ మందులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement