హైదరాబాద్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గైనకాలజీ విభాగంలో టెక్నాలజీ అనేది ఇప్పుడు మరింత కీలకంగా మారిందని డాక్టర్ లావణ్య కొరబండి అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని కాస్మొటిక్ గైనకాలజీ హాస్పిటల్ సొమ్నిఫెరా సెంటర్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెలివరీ తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆ సమయంలో కాస్మొటిక్ గైనకాలజిస్ట్ల సలహాలు, సూచనలు అవసరమని అన్నారు. హార్మోన్ల అసమతుల్యతతో పాటు శరీరంలో జరిగే ఎన్నో విషయాలను మహిళలు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లినికల్ లీడ్ డాక్టర్ కార్తీక్ కుమార్, శివరంజని తదితరులు పాల్గొన్నారు.


