కరోనా: తెలంగాణలో కొత్తగా 767 కేసులు

Coronavirus: 767 New Covid Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 767 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా నమోదైన 767 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,33,146కు చేరింది. గడిచిన ఒక్కరోజులో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3738కి చేరింది.

అదే విధంగా గడిచిన 24 గంటల్లో 848 మంది కరోనా నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్‌ నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,19,344కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 10,064 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top