కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Review Meeting On Department of Mines | Sakshi
Sakshi News home page

కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలం: సీఎం రేవంత్‌

Mar 1 2025 6:21 PM | Updated on Mar 1 2025 6:44 PM

CM Revanth Reddy Review Meeting On Department of Mines

హైదరాబాద్:  కఠినమైన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ ఆదేశించారు. గనుల శాఖపై శనివారం జరిపిన సమీక్షలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్ర‌భుత్వంలోని నీటి పారుద‌ల‌, ఆర్ అండ్ బీ, పంచాయ‌తీరాజ్‌తో పాటు వివిధ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో చేప్ట‌టే ప‌నుల‌కు టీజీఎండీసీ నుంచే ఇసుక స‌ర‌ఫ‌రా చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే.

పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేప‌ట్టే నిర్మాణ రంగ సంస్థ‌లకు అవ‌స‌ర‌మైన ఇసుక‌ను టీజీ ఎండీసీ ద్వారానే స‌ర‌ఫ‌రా చేయాలి. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు స‌మీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువ‌గా వినియోగం జ‌రుగుతోంది. త‌క్కువ మొత్తంలో ఇసుక అవ‌స‌ర‌మైన వారు కొనుగోలు చేసేలా న‌గ‌రానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఏర్పాటు చేయాలి’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

ఇక గ‌నుల శాఖ ప‌రిధిలోని వివిధ ఖ‌నిజాల క్వారీల‌కు గ‌తంలో విధించిన జ‌రిమానాలు, వాటి వ‌సూళ్ల‌పైనా సీఎం అధికారులను ప్ర‌శ్నించారు.దీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న మైన‌ర్ ఖ‌నిజాల బ్లాక్‌ల వేలానికి వెంట‌నే టెండ‌ర్లు పిల‌వాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement