సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల ఆయన ప్రతిపాదిత అమెరికా పర్యటన హఠాత్తుగా రద్దు కావడానికి గల కారణాలను ఈ ప్రెస్మీట్లో సీఎం అధికారికంగా వివరించనున్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
సొంత పార్టీ నాయకత్వంపైనే ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీపీసీసీ ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, తన క్యాబినెట్ సహచరురాలి కుమార్తె చేసిన వ్యాఖ్యలపై, పార్టీలో రేగుతున్న దుమారంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


