హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలకు ముహూర్తం ఖరారైంది. రేపు ఏప్రిల్ 29వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు హాజరై ఫలితాలను విడుదల చేయనున్నారు.
మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం పూర్తి కావడంతో రిజల్ట్స్ రిలీజ్ కోసం ప్రభుత్వం ఆదేశాల కోసం విద్యా శాఖ ఎదురు చూసింది. ఈలోపు గ్రీన్ సిగ్నల్ రావడంతో పలితాలు విడుదల చేస్తోంది.


