సాక్షి, నల్లగొండ: తిప్పర్తిలో ఈ రోజు (శుక్రవారం) మూడు ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. గంగన్నపాలెంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు సతీష్, శ్రీకాంత్, నరేష్ కు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా ఒక చిన్న వివాదం నేపథ్యంలో తలెత్తిన వివాదం కాస్త ముదిరి తీవ్ర ఘర్షణకు దారి తీసినట్లు సమాచారం.


