మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో ఐఏఎంసీ కీల‌కపాత్ర: సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ

CJI NV Ramana And CM KCR IAMC Opend In Hyderabad - Sakshi

ఐఏఎంసీ ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేఖర్ రావు(కేసీఆర్‌) శనివారం ప్రారంభించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఐఏఎంసీ ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు.  రాజీ-మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో ఐఏఎంసీ కీల‌కపాత్ర పోషిస్తుంద‌న్నారు. త‌క్కువ కాలంలో మంచి వ‌స‌తుల‌తో ఐఏఎంసీ ఏర్పాటైందని.. ఐఏఎంసీ ఏర్పాటుకు స‌హ‌క‌రించిన సీఎం కేసీఆర్‌కు ఎన్వీ ర‌మ‌ణ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

చదవండి: వచ్చే ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు! 

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు దీటుగా హైద‌రాబాద్‌: సీఎం కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు దీటుగా హైద‌రాబాద్ పురోగ‌మిస్తోందని.. అనేక రంగాల్లో హైద‌రాబాద్ కేంద్ర బిందువుగా మారుతోందన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ  ప్ర‌ధాన పాత్ర పోషించారన్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top