Telangana: పోలీస్‌ నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు

Changes in Police Recruitment Final Exam Dates by TSLPRB - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్‌ నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి ఈ మార్పులు చేసింది. నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు జరిగినట్లు ప్రకటించింది. ఎస్సై(ఐటీ), ఏఎస్సై( ఫింగర్ ఫ్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు.

ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష 30న నిర్వహించనున్నారు. ఎస్సై(ఐటీ విభాగం) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్చారు. ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12న జరగాల్సి ఉండగా 11వ తేదీకి మార్పు చేశారు. కానిస్టేబుల్ (ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ మార్పు చేసింది.

చదవండి: (క్రీడాకారులతో కబడ్డీ ఆడిన మంత్రి ఎర్రబెల్లి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top