మేడ్చల్: మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శామీర్పేట వద్ద ఓఆర్ఆర్పై కారు అగ్నికి ఆహుతైంది. కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. డ్రైవర్ తేరుకునేలోపే కారును మంటలు చుట్టుముట్టడంతో ఇక తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
కీసర వెళ్తండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ఏసీవేసుకుని పడుకున్న సమయంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది.


