ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెట్టండి | BC Welfare Society Request Etela Rajender On Corporate Hospitals Over Corona | Sakshi
Sakshi News home page

మంత్రి ఈటలకు  బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి 

Dec 14 2020 9:02 AM | Updated on Dec 14 2020 9:02 AM

BC Welfare Society Request Etela Rajender On Corporate Hospitals Over Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వాటిపై నిఘా పెట్టాలని ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ కోరారు. ఈ మేరకు ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి వినతిపత్రం సమరి్పంచారు. కోవిడ్‌–19 నేపథ్యంలో పలు ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, కోవిడ్‌తో పాటు ఇతర చికిత్సలకూ అనవసర పరీక్షలు నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement