బరాజ్‌లపై నిర్ణయం కేసీఆర్‌దే | Barrages were built on the decision taken by KCR himself | Sakshi
Sakshi News home page

బరాజ్‌లపై నిర్ణయం కేసీఆర్‌దే

Jun 18 2025 1:05 AM | Updated on Jun 18 2025 1:05 AM

Barrages were built on the decision taken by KCR himself

మంత్రివర్గ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం జరగలేదు

జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌కు తెలిపిన నీటిపారుదల శాఖ

కేసీఆర్‌ వాంగ్మూలాన్ని తోసిపుచ్చిన ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. గత ప్రభు త్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో బరాజ్‌ల నిర్మాణంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసింది. కేసీఆర్‌ స్వయంగా తీసుకున్న నిర్ణ యాల మేరకే బరాజ్‌లను నిర్మించారని తేల్చి చెప్పింది. 

బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఈ నెల 11న కేసీఆర్‌కు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వ హించగా, మంత్రివర్గ నిర్ణయాల మేరకే బరాజ్‌లను నిర్మించినట్టు బదులిచ్చారు. ఈ నేపథ్యంలో నాటి మంత్రివర్గ సమా వేశాలకు సంబంధించిన మినట్స్‌ కాపీలను సమర్పించాలని కమిషన్‌ 13న రాష్ట్ర ప్రభు త్వానికి లేఖ రాసింది. అదే రోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్య దర్శి రాహుల్‌ బొజ్జా కమిషన్‌ను కలిసి వివిధ మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన మినట్స్‌ కాపీలను అందజేశారు.

బరాజ్‌ల నిర్మాణంపై మంత్రివర్గ నిర్ణయాలేమీ జరగలేదని, మాజీ సీఎం కేసీఆర్‌ మాత్రమే నిర్ణ యం తీసుకున్నారని ఆయన కమిషన్‌కు రాతపూర్వకంగా లేఖ ఇచ్చినట్టు తెలిసింది. వాస్తవానికి కమిషన్‌ విచారణ ప్రారంభించిన వెంటనే కాళేశ్వ రం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఫైళ్లను కమిషన్‌ కార్యాలయా నికి అందజేసినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. కమిషన్‌ మంత్రివర్గ నిర్ణయాలను కోరడంతో మళ్లీ అందజేసినట్టు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement