ఈ నెల 19న హైదరాబాద్‌లో సభ.. వక్ఫ్‌ బిల్లుపై అసదుద్దీన్‌ ఓవైసీ | Asaduddin Owaisi Comments On Waqf Bill | Sakshi
Sakshi News home page

ఈ నెల 19న హైదరాబాద్‌లో సభ.. వక్ఫ్‌ బిల్లుపై అసదుద్దీన్‌ ఓవైసీ

Apr 13 2025 1:32 PM | Updated on Apr 13 2025 1:53 PM

Asaduddin Owaisi Comments On Waqf Bill

హైదరాబాద్‌,సాక్షి: వక్ఫ్‌ బోర్డులో ఇతర మతస్థులు ఉండాలనడం సబబా అని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. వక్ఫ్‌(సవరణ)చట్టం–2025పై అసదుద్దీన్‌ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే వారం సుప్రీం కోర్టు విచారించనుంది.

ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వక్ఫ్‌ బోర్డులో ఇతర మతస్థులు ఉండాలనడం సబబా. కొత్త చట్టంతో కబ్జా చేసిన వాళ్లే యజమానులుగా మారుతారు. చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 19న హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తున్నాం.  ప్రధాని మోదీ తెచ్చిన వక్ఫ్‌ చట్టసవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు,నితీష్‌ సహకారంతోనే నల్ల చట్టం తెచ్చారు’ అని వ్యాఖ్యానించారు.  

వక్ఫ్‌(సవరణ)చట్టం–2025 అసదుద్దీన్‌ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటుండగా.. ధర్మాసనంలో జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథ్‌ ఉంటారని   సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement