
సాక్షి,హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం కేసులో నీటిపారుదలశాఖ ఈఈ నూనె శ్రీధర్ నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు చేపట్టిన దాడుల్లో నూనె శ్రీధర్కు రూ.200కోట్లు ఆస్తుల్ని గుర్తించినట్లు సమాచారం.
ఏసీబీ అధికారుల దాడుల్లో హైదరాబాద్తో పాటు 15 చోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారుల గుర్తించారు. హైదరాబాద్ , కరీంనగర్ వరంగల్లో 19 ప్లాట్లు, తెల్లాపూర్లో విల్లా, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో ఇండివ్యూజువల్ హౌస్, నాంపల్లిలో మల్టీ స్టోరేజ్ బిల్డింగ్, పలు హోటల్స్ బినామీ పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు సోదాల్లో తేలినట్లు సమాచారం. నూనె శ్రీధర్ తన కుమారుడు డెస్టినేషన్ మ్యారేజీని థాయిలాండ్లో చేసినట్లు ఆధారాల్ని సేకరించారు. దీంతో పాటు భారీగా బంగారం, నగలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, నూనె శ్రీధర్ ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8లో ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6,7,8 ప్యాకేజీల పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా శ్రీధర్ వ్యవహరిస్తున్నారు.