మద్యం మత్తులో తగాదా.. | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో తగాదా..

Mar 29 2023 12:20 AM | Updated on Mar 29 2023 7:42 AM

- - Sakshi

అక్రమ సంబంధాన్ని బయటపెడతానని బెదిరించిన ఓ యువకుడిని కాల్చి చంపి తుపాకీతో పరారైన వ్యక్తి

అన్నానగర్‌: పెరంబలూరు సమీపంలో మంగళవారం అక్రమ సంబంధాన్ని బయటపెడతానని బెదిరించిన ఓ యువకుడిని కాల్చి చంపి తుపాకీతో పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. పెరంబలూరు జిల్లా కున్నం తాలూకా మంగళమేడు సమీపంలోని నమైయూర్‌ గ్రామంలోని నరియాడై నరికురువర్‌ కాలనీకి చెందిన రజని (45) భార్య జయంతి. వీరికి ముగ్గురు పిల్లలు. అదే ప్రాంతానికి చెందిన అజిత్‌ (26). ఇతని భార్య శాంతి. వీరికి ఓ చిన్నారి ఉన్నాడు.

శాంతి ఇటీవల మరణించింది. డబ్బు విషయంలో రజనీకాంత్‌, అజిత్‌ మధ్య తగాదాలున్నాయి. రజనీకి అదే ప్రాంతానికి చెందిన సీ్త్రకి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అజిత్‌ మీ సంబంధాన్ని బయటపెడుతానని బెదిరించి రజనీ నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ మద్యం మత్తులో తగాదా పడ్డారు.

దీంతో కోపోద్రిక్తుడైన రజనీ లైసెన్స్‌ లేకుండా తన వద్ద ఉంచుకున్న గన్‌తో అజిత్‌ను కాల్చి పారిపోయాడు. తీవ్రగాయాలైన అజిత్‌ను స్థానికులు పెరంబలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న మంగళమేడు పోలీసులు అజిత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసి నిందితుడు రజనీ కోసం వెతుకుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement