'మామ ఖర్మకాండకు' వెళ్తూ.. విషాదం! | - | Sakshi
Sakshi News home page

'మామ ఖర్మకాండకు' వెళ్తూ.. విషాదం!

Oct 8 2023 2:04 AM | Updated on Oct 8 2023 7:54 AM

- - Sakshi

నాగలక్ష్మి (ఫైల్‌)

సూర్యపేట్‌: మామ ఐదో రోజు ఖర్మకాండకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఆమె భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం వలిగొండ మండలంలోని మాందాపురం సమీపంలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల కేంద్రానికి అడ్డగుల్ల రాములు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు.

రాములు కుమారుడు కిరణ్‌, కోడలు నాగలక్ష్మి(32) బతుకుదెరువు నిమిత్తం కొంతకాలం క్రితం వలిగొండ నుంచి వలస వెళ్లి బీబీనగర్‌ మండలంలోని రాఘవాపురంలో ఉంటున్నారు. శుక్రవారం రాములు ఐదు రోజు ఖర్మకాండకు హాజరయ్యేందుకు కిరణ్‌, నాగలక్ష్మి బైక్‌పై వలిగొండకు వస్తున్నారు. మార్గమధ్యలో మాందాపురం సమీపంలోకి రాగానే వీరి బైక్‌ను వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నాగలక్ష్మి రోడ్డుపై పడిపోగా ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కిరణ్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వారం రోజుల వ్యవధిలో మామ, కోడలు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement