uuవంశధారలో పెరిగిన వరద | - | Sakshi
Sakshi News home page

uuవంశధారలో పెరిగిన వరద

Aug 20 2025 5:33 AM | Updated on Aug 20 2025 5:33 AM

uuవంశధారలో పెరిగిన వరద

uuవంశధారలో పెరిగిన వరద

uuవంశధారలో పెరిగిన వరద

హిరమండలం: హిరమండలం వంశధార గొట్టా బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయానికి వరద నీరు పెరిగింది. ఒడిశా క్యాచ్‌మెంట్‌ ఏరియాతో పాటు రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు వంశధారలో వరద నీరు వచ్చి చేరుతోంది. గొ ట్టా బ్యారేజీ వద్ద గరిష్ట నీటి మట్టం 38.10 మీటర్లు కాగా ప్రస్తుతానికి 38.08 మీటర్ల వరకు నీరు ఉంది. సోమవారం సాయంత్రానికి 10,357 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. మంగళవారం నాటికి 22వేలకు పెరిగింది. వచ్చిన నీటిని 11 గేట్లు 20 సెంటీమీటర్ల మేర పైకి ఎత్తి 20651 క్యూసెక్కులు దిగువకు విడిచిపెట్టినట్లు డీఈ సరస్వతి తెలిపారు. ఎడమ ప్రధా న కాలువ ద్వారా 1430 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు డీఈ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement