టెక్కలిలో జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

టెక్కలిలో జాబ్‌మేళా

Apr 20 2025 2:40 AM | Updated on Apr 20 2025 2:40 AM

టెక్క

టెక్కలిలో జాబ్‌మేళా

టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేకేసీ, వేకెంట్‌ హైర్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించినట్లు ప్రిన్సిపాల్‌ టి.గోవిందమ్మ తెలిపారు. 72 మంది అభ్యర్థులు హాజరు కాగా 34 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పా రు. నియామక పత్రాలను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.సతీష్‌కుమార్‌, జేకేసీ కో–ఆర్డినేటర్‌ బి.ఝాన్సీరాణి, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ సీహెచ్‌.శ్రీధర్‌, శాంతనకుమార్‌, అధ్యాపకులు కసవయ్య, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌కు లావేరు విద్యార్థులు

ఎచ్చెర్ల: 68వ జాతీయ స్థాయి స్కూల్‌ గేమ్స్‌ బేస్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు లావేరు ఉన్నత పాఠశాల క్రీడాకారులు పి.నాగలక్ష్మీ, సీలా సాయికుమార్‌ ఎంపికయ్యారు. ఈ నెల 22 నుంచి 27 వరకూ ఢిల్లీలో జరగనున్న 68వ జాతీయ స్థాయి స్కూల్‌గేమ్స్‌ బేస్‌బాల్‌ పోటీల్లో వీరు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయులు పసుపుల జగన్నాథరావు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రయాణానికి ఆర్థిక సహాయం అందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదే విధంగా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిల్లాస్‌పూర్‌లో జరిగిన 68వ జాతీయ జూనియర్‌ స్కూల్‌గేమ్స్‌ బేస్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొని వచ్చిన 8వ తరగతి విద్యార్థిని అల్లాడ జీవితను అభినందించారు.

బీజేపీ నాయకుల ధర్నా

శ్రీకాకుళం అర్బన్‌: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో నిందితులుగా ఉన్న కాంగ్రెస్‌ ఎంపీలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలను తక్షణమే అరెస్టు చేయాలని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు బూరె నరేంద్ర చక్రవర్తి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం అరసవల్లి కూడలిలోని ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంపద నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక సంపదను దోచుకున్న నిందితులను అరెస్టు చేయాలని కోరారు. నిందితులపై ఈడీ కేసులు నమోదు చేస్తే ఇది బిజెపీ కుట్రపూరిత చర్య అని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతుండడం సిగ్గు చేటన్నారు. అనంతరం రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, నాయకులు శవ్వాన ఉమామహేశ్వరి, పైడి వేణుగోపాలం, బిర్లంగి ఉమామహేశ్వరరావు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జల రాజు వెంకట్‌, సింగుపురపు వెంటరమణ, నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు ధనుష్‌ రంగ, తరుణ్‌, ఉపాధ్యక్షులు మదన మోహన్‌, కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలి

అరసవల్లి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిబ్బంది శనివారం శాంతియుత నిరసన చేపట్టారు. డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట సంఘ జిల్లా అధ్యక్షురాలు ఉష ఆధ్వర్యంలో ఆరోగ్యమందిర్‌లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న 573 మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. నియామకాలు జరిగి ఆరేళ్లు గడుస్తున్నా తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. ఇన్సెంటివ్‌తో పాటు ఏటా 5 శాతం ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

టెక్కలిలో జాబ్‌మేళా 1
1/3

టెక్కలిలో జాబ్‌మేళా

టెక్కలిలో జాబ్‌మేళా 2
2/3

టెక్కలిలో జాబ్‌మేళా

టెక్కలిలో జాబ్‌మేళా 3
3/3

టెక్కలిలో జాబ్‌మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement