డీసీసీబీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
శ్రీకాకుళం అర్బన్: డీసీసీబీ బ్యాంక్ అందించే పథకాలను ఖాతాదారులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంక్ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని డీసీసీబీ బ్యాంక్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతులు, చేతివృత్తులవారు, వ్యాపారులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. అన్ని బ్యాంకుల కంటే డీసీసీబీ అధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకు అని, నవతి ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో బ్యాంకు జనరల్ మేనేజర్లు శిమ్మ జగదీష్, డి.వరప్రసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఎస్వీఎస్ సత్యనారాయణ, శిల్లా రమేష్, జి.సునీల్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఆర్కే భాస్కరరావు, బి.దశరథరామ్, బి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


